బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికో అనుమానాస్పద మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీబీనగర్‌ పెద్ద చెరువులో మెడికో మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు MBBS 4వ సంవత్సరం చదువుతున్న అభిజిత్‌ జోయ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా, మెడికో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్