బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం సీఎం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు, రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం అని అన్నారు. గురువారం ఆయన కేసీఆర్కు సిట్ నోటీసులపై స్పందిస్తూ, తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.