మంగళవారం నల్లగొండ జిల్లా కోదండాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని, మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తగిన సౌకర్యాలు కల్పించి, బస్తాలు అందుబాటులో ఉంచాలని, ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు మాట్లాడుతూ గత 15 రోజులుగా మ్యాచర్ అయిన ధాన్యానికి కూడా బస్తాలు ఇవ్వడం లేదని వాపోయారు.