క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిగా అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లక్కారం, చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని మళ్లించడం ద్వారా ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.