టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వారికి, కష్టపడి పని చేసే వారికి కచ్చితంగా పదవులు వస్తాయని తెలిపారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన పున్నా కైలాష్ నేతకు మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని సూచించారు.