నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తేప్పలమడుగు గ్రామంలో శ్రీ మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా బుధవారం శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం. సి కోటిరెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రథమ వార్షికోత్సవం, మహాశివరాత్రి పండగ సందర్భంగా
స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.