నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేలో గుంతలు పడి, బకెట్ పోర్షన్ భాగాలు దెబ్బతినడంతో ఆందోళన నెలకొంది. 2011లో తాత్కాలిక మరమ్మతులు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదు. నేడు NDSA ఛైర్మన్ అనిల్ జైన్ బృందం ప్రాజెక్టును పర్యటించనుంది. ఈ పర్యటనలో దెబ్బతిన్న స్పిల్వేను పరిశీలించి, మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ పర్యటనతో ప్రాజెక్టుకు మంచి జరుగుతుందో లేదో చూడాలి.