నాగార్జునసాగర్లోని శుభం ఫంక్షన్ హాల్లో మాలమహానాడు నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు అధ్యక్షతన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చెన్నయ్య మాట్లాడుతూ మాలలను అణచివేయడానికి బీజేపీ, కాంగ్రెస్లు ఒకే దారిలో నడుస్తున్నాయని అన్నారు. వర్గీకరణ, రోస్టర్ ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.