వెలిమినేడులో సీపీఎం సమావేశం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సీపీఎం పార్టీ జనరల్ బాడీ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకత్వం హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతా కలిసి కట్టుగా పని చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ దేశబోయిన స్వరూప నర్సింహ్మ మాట్లాడుతూ.. భువనగిరి గడ్డ పై ఎర్ర జెండాను ఎగురవేయాలని, అందరం కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్