మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 334 ప్రాంతాల్లో రోడ్లకు 230 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, వంతెనలు, కాజ్వేల తాత్కాలిక మరమ్మతులకు రూ. 7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టంపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కోమటిరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.