2025-26 రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు అవగాహన గోడపత్రికను కలెక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ధాన్యం రవాణాలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.