నల్లగొండ: సమగ్ర పరిశోధనలే సమాజానికి మార్గదర్శకాలు

నల్లగొండ జిల్లాలోని ఎంజీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ 9వ సమావేశాలలో ఆదివారం పర్యావరణ మార్పుపై పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించి చర్చించారు. ముగింపు సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఈ రేవతి మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, సామాజిక చలనశీలతకు ప్రధాన మార్గం విద్య అయినందున నాణ్యమైన విద్యకై పరిశోధనలు విస్తృతంగా జరగాలన్నారు.

సంబంధిత పోస్ట్