క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

నాగార్జున సాగర్ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శేఖర్ రెడ్డి, సాగర్ ప్రసాద్, ఈర్ల రామకృష్ణ, మున్సిపాలిటీ పట్టణ నాయకులు, మండల నాయకులు, సర్పంచ్‌లు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్