తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. గురువారం తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.