లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్ధలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులకు సత్వర న్యాయానికి లోక్ అదాలత్ దోహదం చేస్తుందన్నారు.