సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ఆనంద్ నగర్ లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఉద్దేశించి మాజీ కౌన్సిలర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం మాట్లాడుతూ, మహిళల సృజనాత్మకతను వెలికితీయడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్