SIRపై BLOలతో సమావేశం, అంగన్వాడీ టీచర్లపై TRS నాయకుల విమర్శలు

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో ఆదివారం SIRపై BLOలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా TRS నాయకులు రామలింగం, ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా, గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు మాత్రమే తిరుగుతున్నారని, వారికి ఎటువంటి సహకారం లభించడం లేదని విమర్శించారు. SIR ప్రక్రియ పూర్తి కావాలంటే ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో టెంటు వేసి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తే ప్రక్రియ వేగవంతమవుతుందని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో SIR ప్రోగ్రాం నత్తనడకన సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్