నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కాసేపు విద్యార్థులతో మాట్లాడారు.