నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడ్మల్గిద్ద గ్రామానికి చెందిన పెద్దింటి రామకృష్ణ పిడిఎస్యు విద్యార్థి సంఘంలో గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయివరకు నేతగా పనిచేశారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.