నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐకి అనుమతులు ఇస్తూ ఎస్ఎఫ్ఐ నిరసనలకు అనుమతి నిరాకరించడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. మరోవైపు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అధిక ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ ఆరోపిస్తూ, ఫీజు దోపిడీని అరికట్టాలని, బి-కేటగిరీ సీట్లను ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.