TG: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వారికి కాంటాక్ట్లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.