తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పటేల్ రమేష్ రెడ్డిని కడెం మండల మాజీ ఎంపీపీ అలెగ్జాండర్ కలిశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.