ఇంటి పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ కార్యదర్శి శ్రీనివాసు నాయక్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇళ్ల పరిసరాలలో నీటి గుంతలు ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.