ముథోల్ మండలం రాంటేక్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని గురువారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామఅభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో కళ్యాణమండపం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.