హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, రానున్న మూడు రోజులు తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రేపు ఉదయం 8:30 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఆస్కారముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.