ముధోల్లో హోరాహోరీగా కుస్తీ పోటీలు

ముధోల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. మల్లయోధులు చివరి వరకు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడిన తీరు చూపరులను కనువిందు చేసింది. పోటీలో గెలుపొందిన విజేతకు ఐదు వేల నగదును అందించారు. దాదాపు మల్లయోధులకు లక్ష వరకు నగదు బహుమతులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్