కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలసి బడ్జెట్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. తన బృందంతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లిన నిర్మలమ్మకు ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి మిఠాయి తినిపించారు. మరికాసేపట్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.