నిజామాబాద్: అక్రమ మొరం తరలిస్తున్న 3 టిప్పర్లు, యంత్రాలు సీజ్

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిధిలోని నందిపేట మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మూడు టిప్పర్లు, ఒక హిటాచీ–200 చైన్ మెషిన్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో దాస్‌నగర్‌కు చెందిన నలుగురు, మాదాపూర్‌కు చెందిన ఒకరు, దేహగాం గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసినట్లు నందిపేట ఎస్‌ఐ తెలిపారు. ఈ సంఘటన 2026 జూన్ 27న జరిగింది.

సంబంధిత పోస్ట్