పేకాట స్థావరంపై పోలీసుల దాడి...

మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై మాక్లూర్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 5300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మాక్లూర్ ఎస్పై రాజశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్