దొంగ పట్టివేత.. బంగారు నగలు స్వాధీనం

ఆర్మూర్ పట్టణంలో ఇటీవల ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడిన పిప్రి గ్రామానికి చెందిన అల్లకుంట శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 11న అర్ధరాత్రి ఔటీ గల్లి నుంచి హుస్నాబాద్ కాలనీ వరకు తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎన్హెచ్్వ సత్య నారాయణ తెలిపారు. అతని వద్ద నుంచి 6.9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు కిరణ్ కుమార్, హరీష్, లక్ష్మి, నారాయణలను ఎన్హెచ్్వ నగదు రివార్డుతో అభినందించారు.

సంబంధిత పోస్ట్