బాల్కొండ మండలం శ్రీరాంపూర్లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. శెట్పల్లి నుంచి నిత్యం బాల్కొండకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.