రెంజల్ లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన ఊరేగింపు ఆదివారం మధ్నాహ్నం 12 గంటల నుండి ప్రారంభమై రాత్రి ముగిసింది. వీధుల వెంట యువకుల తీన్మార్ స్టెప్పులతో అమ్మవారి శోభాయాత్ర దద్దరిల్లింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్