బోధన్ మండలం ఏరాజ్పల్లి సహకార సంఘం భవనం వద్ద రైతులు బుధవారం యూరియా యాప్ను రద్దు చేయాలని, ఎకరానికి నాలుగు బస్తాల యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ ను రద్దు చేయకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.