మంగళవారం, రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎక్స్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మహారాష్ట్ర నాగపూర్కు చెందిన యశ్వంత్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, న్యాయాధికారి నిందితుడికి 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.