రామారెడ్డి మండలం గోకుల్ తండాలో 30 ఏళ్ల క్రితం గ్రామం కోసం వేసిన రెండు బోర్లా స్థలాన్ని, దారిని కబ్జా చేయడంపై ఘర్షణ జరిగింది. గురువారం గ్రామస్తులు చర్చిస్తుండగా, మాలవతు నవాయిరాం కుటుంబం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో భగవత్ రంగి, భగవత్ నీలా, సంగ్యాలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.