నిజాంసాగర్ మండలంలో కుక్క ను చంపిన చిరుత

నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని పొలంలో ఆదివారం చిరుత కుక్కపై దాడి చేసి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో మండలంలో చిరుత సంచారం పెరగడంతో ప్రజలు ఒంటరిగా వెళ్లడానికి, రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. చిరుత కదలికలపై నిఘా పెంచి తగిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్