జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత గురువారం మాజీ మంత్రి హారిశ్ రావు ఇంటికి వెళ్లారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణించగా.. కుటుంబానికి మద్దతుగా, కల్వకుంట్ల కవిత అక్కడికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్శనలో ఆమె సంతాపం తెలిపారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.