డిచ్పల్లిలోని మానవతా సదన్ లో గురువారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, నోట్ బుక్ లు పంపిణీ చేశారు. అనాధ బాలల సంరక్షణలో మానవతా సదన్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకుంటోందని, సిబ్బంది సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని, దీనివల్ల అనేక మంది ఉన్నత చదువులు చదువుతున్నారని ఆయన అన్నారు.