నిజామాబాద్: అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్‌ను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో పాత నేరస్తులు కూడా ఉన్నారని, వీరి వద్ద నుంచి 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, రూ.2.75 లక్షల నగదు, దొంగిలించిన వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్