నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులతో పాటు ఓ మహిళ, పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని, హైదరాబాద్కు చెందిన బ్రోకర్ ద్వారా మహిళలను రప్పిస్తున్నారని తెలిపారు. రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఈ వివరాలను వెల్లడించారు.