నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ నుండి కొట్టాలపల్లి వెళ్లే మార్గంలో బీరప్ప తండా వద్ద గత సంవత్సరం వరదల వల్ల కొట్టుకుపోయిన బ్రిడ్జిని అధికారులు పట్టించుకోకపోవడంతో, కొద్దిపాటి వర్షాలకే రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటీవల ఐచర్ బండి దిగబడటంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. దీంతో బీరప్ప తాండ గ్రామ ప్రజలు ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.