రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ భవనాలు నిర్మించనున్నట్లు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కతో కలిసి నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ భవనం పూర్తయ్యాక రాహుల్ గాంధీ చేతులమీదుగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్లో మొదటి భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.