తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లాను ఎంపీ ధర్మపురి అర్వింద్ గురువారం హైదరాబాద్లోని లోక్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన శివ్ప్రతాప్ శుక్లాను సాదరంగా స్వాగతం పలికామని, ఆయన విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై ఉన్న లోతైన అవగాహన ద్వారా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామని ఎంపీ అర్వింద్ తెలిపారు.