నిజామాబాద్ నగరంలోని మార్కెట్ యార్డ్ను ఎంపీ అరవింద్ సందర్శించి, పసుపు ధరల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం, ఆయన జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండే ఎంపీ అరవింద్ ఇంటర్వ్యూ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.