నిజామాబాద్లో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ ఆధ్వర్యంలో బుధవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ప్రారంభించారు. దీనిలో భాగంగా తల్లులతో లబ్ధిదారులతో పిల్లల నమోదు కొరకు ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీడీపీఓ స్వర్ణలత, సూపర్వైజర్ శ్రీ ప్రియ, అంగన్వాడీ టీచర్ సునీత, లబ్ధిదారులు పాల్గొన్నారు.