హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, నిజామాబాద్ పౌర సరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా నిజామాబాద్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఖానాపురంలోని ఒక రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని శుభ్రపరిచి, మళ్లీ పాలిష్ చేసి విక్రయించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో 800 క్వింటాళ్ల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 51 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.