నిజామాబాద్ డివిజన్ పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ. 17 లక్షల విలువైన 170 సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సెల్ఫోన్ రికవరీ మేళాలో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఈ ఫోన్లను బాధితులకు అప్పగించారు. విలువైన సమాచారం ఉన్న ఫోన్లతో అజాగ్రత్తగా ఉండవద్దని, పోగొట్టుకున్నా లేదా చోరీ జరిగినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో లేదా సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.