సభ్య సమాజం తలదించుకునే ఘోరమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. జైపూర్లోని మల్వాణీ ప్రాంతంలో కన్నతండ్రే ఏడాది కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డ రక్తస్రావం జరిగి నొప్పితో ఏడుస్తున్నా వదలని కర్కశుడు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జులై 28న జరగగా బిడ్డ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.