కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్లో పోస్ట్ చేస్తూ, 'హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్' అంటూ చంద్రబాబు దుష్టపాలనలో పోలీసు యంత్రాంగం ప్రమాదకర ధోరణిలో ఉందని ఆరోపించారు. దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటారని, ఇది రాజ్యాంగ హక్కులపై, ప్రజాస్వామ్య విలువలపై దాడి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు రౌడీ పోలీస్ రాజ్యం, జంగిల్ రాజ్ కాదని, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలని జగన్ అన్నారు.