1982 మార్చి 29న హైదరాబాద్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 'తెలుగువారి ఆత్మగౌరవం' నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ చైతన్య రథంపై రాష్ట్రమంతటా పర్యటించారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని, 1983 జనవరి 9న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ తొలిపోటీలో పోస్టు గ్యాడ్యుయేట్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లు, పట్టభద్రులు పోటీ చేశారు.